← Back to news

కర్ణాటకలో భిక్షగత్తె మృతి…ఇంట్లో ₹8.40 లక్షలు

By Vishi· 24 Aug 2026
కర్ణాటకలో భిక్షగత్తె మృతి…ఇంట్లో ₹8.40 లక్షలు

జీవితాంతం భిక్షాటన చేస్తూ గడిపిన ఓ మహిళ ఇంట్లో లక్షల రూపాయల నగదు దొరికింది. హూర్(68) తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. సోదరి రెండేళ్ల క్రితం మరణించారు. వీళ్లిద్దరూ వివాహం చేసుకోలేదు. ఆదివారం హూర్ మరణించింది. తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా, 10, 20, 50 రూపాయల నోట్లు, వేలాది నాణేలు కలిపి 30కు పైగా సంచుల్లో కనిపించాయి. మొత్తం ₹8,40,000 ఉన్నట్లు గుర్తించారు. అందులో కొంత సోదరులు తీసుకోగా, మిగిలింది మసీదుకు దానం చేశారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 5h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.