కుల వివక్షపై రాష్ట్రపతికి మల్లు రవి లేఖ!

నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కీలక లేఖ రాశారు. కుల వివక్ష, అంటరానితనం వంటి రాజ్యాంగ విరుద్ధ చర్యలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో జరిగిన “శుద్ధీకరణ” ఘటనపై స్పందించారు. ఆ ఘటనపై రాజ్యాంగపరమైన జోక్యం చేసుకోవాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 8న రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా కోరారు.



