← Back to news

కుల వివక్షపై రాష్ట్రపతికి మల్లు రవి లేఖ!

By Srinivas· 2d ago
కుల వివక్షపై రాష్ట్రపతికి మల్లు రవి లేఖ!

నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కీలక లేఖ రాశారు. కుల వివక్ష, అంటరానితనం వంటి రాజ్యాంగ విరుద్ధ చర్యలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన “శుద్ధీకరణ” ఘటనపై స్పందించారు. ఆ ఘటనపై రాజ్యాంగపరమైన జోక్యం చేసుకోవాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 8న రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా కోరారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 6h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.