టోల్ సొమ్ము మళ్లింపు..ఈడీ సోదాల్లో వెలుగులోకి

ఫాస్ట్ట్యాగ్ టోల్ వసూళ్లలో భారీ అవినీతిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సీరియస్ అయ్యింది. ఆరు రాష్ట్రాల పరిధిలోని 14 టోల్ ప్లాజాల్లో అధికారులు ఒకేసారి సోదాలు నిర్వహించారు. అక్రమ సాఫ్ట్వేర్, యాప్ల ద్వారా నకిలీ బిల్స్ సృష్టించి, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన టోల్ సొమ్మును పక్కదారి పట్టించినట్లు తేల్చారు. ఈ దాడుల్లో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.



