← Back to news

ఆస్పత్రిలో సౌకర్యాల కొరత.. రోగుల అవస్థలు

By Thukaram Anumula· 2d ago

TG: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సౌకర్యాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ అధ్యక్షుడు అనుముల తుకారం ఆరోపించారు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నా, కూర్చోవడానికి సరిపడా కుర్చీలు కూడా లేవని అన్నారు. పేషెంట్ల చిట్టీలు రాసే విషయంలో పరిచయాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 8h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.