← Back to news

ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి అమిత్ షా!

By sahani· 25 Jul 2026· Delhi
ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి అమిత్ షా!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని పరిస్థితులు, క్యాబినెట్‌లో మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అమిత్ షా.. ప్రధాన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. దేశ విద్యా వ్యవస్థలో ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఆయన సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి ప్రశంసించారు.

More in Politics