← Back to news

ప్రైవేటీకరణ.. సింగరేణి క్లారిటీ!

By samson· 2d ago
ప్రైవేటీకరణ.. సింగరేణి క్లారిటీ!

పెద్దపల్లి జిల్లా సింగరేణి గనుల ప్రైవేటీకరణ వార్తలు అవాస్తవమని యాజమాన్యం స్పష్టం చేసింది. ’’ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన కూడా పరిశీలనలో లేదు. 21 భూగర్భ గనులు, 17 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర.. ఇలా 5 రాష్ట్రాలకు కోల్ సరఫరా చేస్తుంది. కొన్ని గనులు నష్టాల్లో ఉన్నా.. ఉద్యోగ భద్రత కోసం వాటిని కొనసాగిస్తున్నామ’’ని తెలిపింది. శాంతిఖని ఈఓఐ ఆధారంగా ప్రైవేటీకరణ ప్రచారం వాస్తవ విరుద్ధమని పేర్కొంది. శాంతిఖని ఈఓఐకి స్పందన రాని సంగతి తెలిసిందే.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 6h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.