రఘురామ టార్చర్ కేసుపై ఏపీ హై కోర్టు సీరియస్ కామెంట్స్..

ఏపీ అసెంబ్లీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసుపై ఏపీ హై కోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారు, పార్లమెంటుపై దాడి చేసిన వారికి తేడా లేదని కామెంట్ చేసింది. అప్పటి ఎంపీని టార్చర్ చేయబోతున్నారని ముందే తెలిసినా అప్పటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఆ ఘటనలో పాల్గొనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఇక ఈ కేసులో ఆ అధికారి సరెండర్ అవుతారా? ముందస్తు బెయిల్ పై ప్రొసీడ్అవుతారా ఏదో ఒకటి తేల్చుకోవాలని కోరింది.



