మందసలో రూ.1.20 కోట్ల బ్రిడ్జిల తనిఖీ

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో చీపి–బుడంబో, దాలసరి–బుడంబో మధ్య రూ.60 లక్షల చొప్పున రెండు బ్రిడ్జిలు నిర్మించారు. ఐటీడీఏ ఈఈ రమాదేవి గురువారం వాటి క్వాలిటీ, మెటీరియల్ ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యత నిర్ధారణ అనంతరమే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ బ్రిడ్జిలతో గ్రామాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందని, రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.



