ఏలూరులో ధరలపై న్యూ డెమోక్రసీ భారీ నిరసన

ఏలూరు జిల్లాలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ గురువారం ధరలపై భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, హోటల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫైర్ స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నినాదాలు చేశారు. బ్లాక్ మార్కెట్ అరికట్టాలని, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు.




