పిడుగుపాటుకు దూడలు మృతి

TG: జోగులాంబగద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలో పిడుగుపాటుకు రెండు దూడలు మృతి చెందాయి. ఫ్రైడే మార్నింగ్ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి సద్దలోనిపల్లి విలేజ్లో పిడుగు పడడంతో రైతు బంట్రోతు కుశలన్నకు చెందిన రెండు కోడె దూడలు మృతి చెందాయి. రెండు దూడల విలువ రూ. 1.50,000 ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.


