జీరుగెడ్డలో 19 మంది రైతులకు జీరాయితీ పట్టాల పంపిణీ

అల్లూరి సీతారామరాజు జిల్లా బొర్రా పంచాయతీ జీరుగెడ్డలో గురువారం రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా 19 మంది రైతులకు జీరాయితీ పట్టాలు అందజేశారు. పట్టాలు పొందిన రైతులు రైతు భరోసా కేంద్రంలో ఆన్లైన్లో నమోదు చేసుకుంటే రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు వర్తిస్తాయని సర్పంచ్, ఎంపీటీసీ సూచించారు. పెసా కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, స్థానికులు పాల్గొన్నారు.



