అల్జీమర్స్ కి ఫస్ట్ స్టేజ్లో డ్రగ్ వాడితేనే రిజల్ట్ అంటున్న నిపుణులు

మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్) చికిత్సలో కొత్త ఔషధాలు అద్భుతాలు సృష్టిస్తున్నా.. అవి వ్యాధి ప్రారంభ దశలో ఉన్న రోగులపైనే అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెదడులో కణాలు పూర్తిగా దెబ్బతినక ముందే, అంటే ‘ఎర్లీ స్టేజ్’లోనే ఈ డ్రగ్స్ ఇస్తే వ్యాధి తీవ్రతను విజయవంతంగా అడ్డుకోవచ్చని రీసెర్చ్లలో తేలింది. ముదిరిన తర్వాత వాడితే పెద్దగా ఫలితం ఉండదని, అందుకే ఫస్ట్ స్టేజ్లోనే గుర్తించడం కీలకమని హెచ్చరిస్తున్నారు.



