← Back to news

విశాఖలో సామాజిక శంఖారావం

By MADHAVI· 27 Aug 2026
విశాఖలో సామాజిక శంఖారావం

AP: దళితుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సామాజిక శంఖారావంలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద KVPS, CITU, AIDWA, DYFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దళిత కాలనీలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల రోజులుగా విశాఖ నగరంలోని వివిధ దళిత వాడల్లో ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు సర్వే నిర్వహించి అనేక సమస్యలను గుర్తించారు. స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా దళిత కాలనీల్లో కుల వివక్ష కొనసాగుతుండటం దురదృష్టకరమని నాయకులు అన్నారు.

విశాఖలో సామాజిక శంఖారావం

More in Local