రైతుభరోసా వద్దని రెండునెలలు తిరిగాను: బీ.సుదర్శన్రెడ్డి

TG: CM రేవంత్ రెడ్డి కౌలు రైతులకు ఇచ్చిన హామీతో పాటు వరంగల్ డిక్లరేషన్ను ఇంప్లిమెంట్ చేయాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ బీ.సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కౌలు రైతుల సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాకు సుప్రీంకోర్టు నుంచి పెన్షన్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తాను. ఉండటానికి ఇల్లు కూడా ఉంది. అయినా నాకు రైతుభరోసా ఇస్తుంటే దాన్ని వదిలించుకోవడానికి రెండునెలలు అధికారుల చుట్టూ తిరిగానన్నారు. మొత్తానికి రైతుభరోసాను వదిలించుకున్నట్లు చెప్పారు.



