← Back to news

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి

By Karimulla Shaik· 18 Aug 2026· పల్నాడు జిల్లా
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి

AP: పల్నాడు జిల్లా నుకొండలో APUWJ 70వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై చర్చించారు. అనంతరం వినుకొండ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలు, వృత్తిపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు.

More in Local