నేపాల్ వరదల్లో 903కి చేరిన మృతుల సంఖ్య

నేపాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో చనిపోయినవారి సంఖ్య 903కి పెరిగింది. అధికారుల ప్రకారం 4,247 మంది ఇంకా కనిపించడం లేదు. ఇప్పటివరకు 10,451 మందిని కాపాడారు. సహాయక చర్యల కోసం 20 వేల మంది సైనికులు, 14 హెలికాప్టర్లు పని చేస్తున్నాయి. ఆరు ప్రత్యేక వైద్య బృందాలు కూడా సాయం చేస్తున్నాయి. ఇప్పటిదాకా 149 నుంచి 180 మంది భారతీయులను కాపాడగా, 275 నుంచి 320 మంది ఇంకా కనిపించడం లేదు. కొందరు తెలుగు యాత్రికులు సురక్షితంగా కాఠ్మండు చేరుకున్నారు.


