← Back to news

కంఠంరాజు కొండూరులో ఉచిత వైద్య శిబిరం

By epuri rajaratnam· 20 Aug 2026
కంఠంరాజు కొండూరులో ఉచిత వైద్య శిబిరం

AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులోని కారుమంచి గోవిందయ్య ఉన్నత పాఠశాలలో ఎన్నారై సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ పోలవరపు రాఘవరావు పర్యవేక్షణలో జరిగిన శిబిరంలో ఈఎన్‌టీ, దంత, స్త్రీలు, చిన్నపిల్లలు, కంటి పరీక్షలతోపాటు ఈసీజీ, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగిన శిబిరంలో 500 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

More in Local