← Back to news

1000 రోజుల కాంగ్రెస్.. గద్వాలలో బీఆర్ఎస్ ధర్నా!

By VEMANNA· 2d ago
1000 రోజుల కాంగ్రెస్.. గద్వాలలో బీఆర్ఎస్ ధర్నా!

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ.. పార్టీ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. కృష్ణారెడ్డి బంగ్లా నుంచి మొదలైన ఈ ర్యాలీ.. 420 అడుగుల ఫ్లెక్సీతో కృష్ణవేణి చౌక్ వరకు సాగింది. కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ ధర్నా చేశారు. కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాల పూత అని నిరసన తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 5h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.