← Back to news

కారులో గంజాయి.. భద్రాద్రిలో కేసు!

By samson· 2d ago
కారులో గంజాయి.. భద్రాద్రిలో కేసు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయి సీజ్ చేశారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో అశ్వాపురం పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఒడిశా నుంచి షిర్డీకి కారులో 40.56 కిలోల గంజాయి తరలిస్తున్నారు. రూ.20 లక్షల విలువ చేసే ఈ గంజాయిని గొల్లగూడెం కెనాల్ బ్రిడ్జి వద్ద పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒడిస్సాకు చెందిన దంపతులు అరబిందో బిశ్వాస్, సుప్రియలను అరెస్ట్ చేశారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 7h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.