400 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

TG: మేడ్చల్ జిల్లా శామీర్పేట నుంచి సిద్దిపేటకు అక్రమంగా తరలిస్తున్న 400 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. నిఘా ఏర్పాటు చేసిన అధికారులు డీసీఎంను వెంబడించి సిద్దిపేటలోని మహాలక్ష్మి రైస్మిల్ వద్ద అడ్డుకున్నారు. తనిఖీల్లో వాహనంలో 120 క్వింటాళ్ల బియ్యం లభించగా, మిల్ పరిసరాల్లో మరో 280 క్వింటాళ్లు గుర్తించారు. డ్రైవర్ శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. రైస్మిల్ యజమాని నాగరాజును విచారణ చేపట్టారు.



