← Back to news

దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలి

By TIRUPATI PEOPLE VOICE· 18 Aug 2026· తిరుపతి జిల్లా
దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలి

AP: తిరుపతి జిల్లాలో దళితుల సమస్యల పరిష్కారం కోసం ‘చలో కలెక్టరేట్’కు పిలుపు ఇచ్చారు. దళితులకు స్మశానాలు, వాటికి దారులు, భూ సమస్యలు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24న పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. సమస్యలపై కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. జిల్లాలోని పలు గ్రామాల్లో దళితులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని, అనేక ప్రాంతాల్లో స్మశానాలకు స్థలాలు, దారులు లేవని ఆరోపించారు.

More in Local