మళ్లీ పెరిగిన బంగారం ధరలు

గ్లోబల్ మార్కెట్లో జియోపాలిటిక్స్ కారణాల వల్ల బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.230 పెరిగి రూ.1,55,890 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,42,900కి చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి కాబట్టి, బై చేసే ముందు లైవ్ ప్రైసెస్ చెక్ చేసుకోవడం బెటర్.


