← Back to news

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై గుంటూరు కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

By rajaratnam· 1d ago
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై గుంటూరు కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

గుంటూరు జిల్లా పట్నంబజార్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నగర కమిషనర్ మయూర్ అశోక్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. నిషేధిత ప్లాస్టిక్ గుర్తించి దుకాణాలు సీజ్ చేసి జరిమానాలు విధించారు. 45 రోజులుగా అవగాహన కల్పించినా చర్యలు తీసుకోని సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. తయారీ సంస్థల వివరాలు సేకరించి కఠిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారులపై కూడా జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.