రావణాసురుడిగా సీఎం విజయ్..కేసు నమోదు

తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్ మారియమ్మన్ ఆలయంలో ఆషాఢ మాస వేడుకలో యువకులు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ని రావణాసురుడిగా, త్రిషను అమ్మవారిగా చూపిస్తూ బ్యానర్ వేశారు. గుడి వేడుకలో సినిమా నటులను దేవుళ్ల రూపంలో చూపించడం సరికాదంటూ అక్కడున్నవాళ్ళందరూ మండిపడ్డారు. బ్యానర్ వేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.



