సోషల్ మీడియా సంస్థలకు పార్లమెంటరీ కమిటీ పిలుపు

సోషల్, డిజిటల్ ప్లాట్ఫారమ్ల నియంత్రణపై చర్చకు ప్రధాన సోషల్ మీడియా సంస్థలను, కేంద్ర ప్రభుత్వ అధికారులను పార్లమెంటరీ కమిటీ ఆగస్టు 3న జరిగే సమావేశానికి ఆహ్వానించింది. యూసర్ ప్రైవసీ, సెక్యూరిటీ, ప్రజా శాంతిభద్రతలకు సంబంధించి సోషల్ మీడియా సంస్థలు ఎలా నిర్వహిస్తున్నాయనే విషయంపై ఇందులో చర్చించనున్నారు. NEET-UG పేపర్ లీక్ నిరసనల ప్రచారంలో CJP సోషల్ మీడియాను, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించిన కొద్ది రోజులకే ఈ సమావేశం జరుగుతుండటం గమనించాల్సిన విషయం.



