భద్రాద్రికి రైలు మార్గానికి కదలికొచ్చిందోచ్...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కీలకమైన పాండురంగాపురం–మల్కన్ గిరి రైల్వే లైన్ పనులకు మరోసారి కదలిక వచ్చింది. పాండురంగాపురం నుంచి సాకేతపురి వరకు 16 కి.మీ. లైన్ ను ముందుగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, పనుల వేగవంతానికి ఆదేశించారు. భద్రాచలం ఆలయ భక్తులకు ఈ మార్గం ఎంతో ఉపయోగకరం.



