← Back to news

భద్రాద్రికి రైలు మార్గానికి కదలికొచ్చిందోచ్...

By samson· 1d ago
భద్రాద్రికి రైలు మార్గానికి కదలికొచ్చిందోచ్...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కీలకమైన పాండురంగాపురం–మల్కన్ గిరి రైల్వే లైన్ పనులకు మరోసారి కదలిక వచ్చింది. పాండురంగాపురం నుంచి సాకేతపురి వరకు 16 కి.మీ. లైన్ ను ముందుగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, పనుల వేగవంతానికి ఆదేశించారు. భద్రాచలం ఆలయ భక్తులకు ఈ మార్గం ఎంతో ఉపయోగకరం.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.