సైబర్ మోసాలపై మంచిర్యాలలో అవగాహన!

మంచిర్యాల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో సైబర్ మోసాలపై ప్రత్యేక సెషన్ జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడారు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని, ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించారు. ఆన్లైన్ విరాళాలు, నకిలీ లింకులు, ఫేక్ ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మోసం జరిగితే వెంటనే 1930కి ఫోన్ చేయాలని చెప్పారు.





