← Back to news

సైబర్ మోసాలపై మంచిర్యాలలో అవగాహన!

By Srikanth· 2d ago· Ramagundam, Ramagundam, Peddapalli
సైబర్ మోసాలపై మంచిర్యాలలో అవగాహన!

మంచిర్యాల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో సైబర్ మోసాలపై ప్రత్యేక సెషన్ జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడారు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని, ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్ విరాళాలు, నకిలీ లింకులు, ఫేక్ ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మోసం జరిగితే వెంటనే 1930కి ఫోన్ చేయాలని చెప్పారు.

సైబర్ మోసాలపై మంచిర్యాలలో అవగాహన!
సైబర్ మోసాలపై మంచిర్యాలలో అవగాహన!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 6h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.