కేరళలో పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్పై వివక్ష..నిరసన

కేరళలోని తుంచత్ ఎళుత్తచ్చన్ మలయాళ యూనివర్సిటీలో దళిత్ పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్ అనఘా శశి తన తల్లి అంబికా శశితో కలిసి ఆరు రోజులుగా నిరసన చేస్తున్నారు. యూనివర్సిటీలో తనపై వివక్ష చూపుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. 2024 మార్చిలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగంలో చేరిన అనఘ కోర్స్ వర్క్ పూర్తి చేసిన తర్వాత ఏడాదైనా రీసెర్క్ స్టార్ట్ చేయలేకపోయారు. గైడ్ అరుణ్ బాబు, ప్రొఫెసర్ జైని వర్గీస్ తనకు క్లీనింగ్ పనులు, క్లెరికల్ పనులు అప్పగించారని ఆమె ఆరోపిస్తున్నారు.


