కామారెడ్డి జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి

TG: కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను నిర్మించాలని, కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని మౌలిక సదుపాయలను కల్పించాలని AISA, SFI ,విద్యార్థి సేన, GVS విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి వినతిపత్రం అందించారు. విద్యార్థులకు అనుగుణంగా గదులు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, AISA జిల్లా కన్వీనర్ విట్ఠల్, విద్యార్థిసేన జిల్లా అధ్యక్షుడు వినయ్, GVS జిల్లా అధ్యక్షులు వినోద్ పాల్గొన్నారు.



