BRS నేతలపై కేసులు, అరెస్టులు

TG : అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన గొడవపై పోలీసులు 5 కేసులు పెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్పై బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేశారని ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి, మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. మరోవైపు పోలీసులపై దాడి చేశారంటూ కేటీఆర్, హరీశ్ రావుతో పాటు 15 మంది బీఆర్ఎస్ నేతలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.



