ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
AP: ఆకివీడు రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు ఆనందం వ్యక్తం చేశారు. రామాలయం తరఫున సమర్థవంతంగా వాదించిన సీనియర్ లాయర్ సుయోధన్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ప్రేరణ సింగ్ను అభినందించారు. ఈ పోరాటంలో తనకు అండగా నిలిచిన లక్షలాది మంది భక్తులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.



