అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: పీఏసీ ఛైర్మన్

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో మియాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 61,482 కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియని ఆయన తెలిపారు. పేదల కోసం సన్నబియ్యం, క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు.



