చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
AP: NTR జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం చంద్రాల భూనిర్వాసితులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 2016లో రహదారి విస్తరణలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆరోపిస్తూ వారు పాదయాత్రగా అసెంబ్లీకి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు చంద్రాల భూ నిర్వాసితులను రైతు భరోసా కేంద్రానికి తరలించారు. అనంతరం మైలవరం తహసీల్దార్ అబ్దుల్ దరియా, ఎస్ఐ సుధాకర్ సమక్షంలో ఆర్డీవో నిర్వాసితులతో చర్చలు నిర్వహించారు.



