దిల్లీలో పోలీసులపై అటాక్.. కారం పొడి, ఇటుకలతో దాడి!
దిల్లీలోని ముకుంద్పూర్లో పోలీసులపై అటాక్ జరిగింది. పెట్రోలింగ్లో ఉన్న ముగ్గురు పోలీసులపై కొంతమంది కారం పొడి, ఇటుకలు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఓ హెడ్ కానిస్టేబుల్కు తలకు గాయమైంది. సరైన డాక్యుమెంట్స్ లేని బైక్ను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లిన తరువాత ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నాయి.



