← Back to news

తెలంగాణలో ఈ–కేబినెట్ మీటింగ్స్

By డీకే· 15 Jun 2026· Dishadaily· హైదరాబాద్‌
తెలంగాణలో ఈ–కేబినెట్ మీటింగ్స్

TG: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్స్ ఇకపై ఎలక్ట్రానిక్ విధానంలో జరగనున్నాయి. పరిపాలనలో పేపర్‌లెస్ విధానాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అన్ని కార్యాలయాల్లో ముఖ్యంగా సచివాలయం, డైరెక్టరేట్, కమిషనరేట్ కార్యాలయాల్లో పేపర్‌లెస్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. దీంతో అత్యాధునిక ట్యాబ్‌లు కొనుగోలు చేయడం, వాటికి అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్లను సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) నుంచి సాఫ్ట్‌వేర్‌ను తీసుకుంటున్నారు.

More in TG