జమ్ములో లోయలో పడిన బస్సుః 21 మంది మృతి

జమ్ము కశ్మీర్ లో ఉధంపూర్ రూట్ లో వెళుతున్న ఒక బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా అనేక మందికి గాయాలయ్యాయి.రాం నగర్ నుంచి ఉధంపూర్ వెళుతుండగా మధ్యలో జూలో అనే ప్రాంతంలో కొండమలుపు దగ్గర బస్సు టర్న్ తీసుకుంటుండగా లోయలో పడిపోయింది. ఉదయం పది గంటలకు ప్రమాదం జరిగింది.ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.



