మాధవరం కలాన్.. ప్రత్యేక మండలంగా డిమాండ్!

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఓ కొత్త డిమాండ్ వినిపిస్తోంది. మాధవరం కలాన్ను ప్రత్యేక మండలంగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. ఊటుకూరు, బండమిదీగూడెం, కొండారం, చిత్తలూరు, వంగమర్తి, ఇటుకులపాడ్, ఓగోడు, నడిగూడెం.. ఇలా మొత్తం 9 గ్రామాలను కలిపి కొత్త మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్. మాజీ నీటిసంఘం చైర్మన్ దొంతురి యాదగిరి, యారాల మాధవరెడ్డి ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. దీనిపై ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి స్పందించి, రెవెన్యూ సెక్రెటరీ లోకేష్ కుమార్కి సిఫారసు చేశారు.



