దేశంలో సరైన నాయకత్వం లోపించింది: కేటీఆర్
TG: ‘అన్నీ ఉన్న మన దేశంలో సరైన నాయకత్వం లోపించింది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ మనం నియంతృత్వ దేశాలతో కాకుండా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకోవాలని సూచించారు. దేశం ఇంకా ఎన్నో సమస్యలతో నిండి ఉందన్నారు. తన కూతురి గురించి వివరిస్తూ తన కుమార్తెను ఇక్కడే చదువుకోమని అడిగితే, అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయని ప్రశ్నిస్తోందని వివరించారు. మనం శ్రీలంక కంటే మెరుగైన స్థితిలో లేమని వివరించారు.


