‘పుష్ప' బ్రిడ్జ్ ఎక్కడుందో మీకు తెలుసా?
AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోతుగూడెం ఫోర్బే డ్యామ్ బ్రిడ్జ్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో ఉన్న ఈ డ్యామ్ను స్థానికులు ‘పుష్ప బ్రిడ్జ్’ అని పిలుస్తారు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రంలోని ఎర్రచందనం స్మగ్లింగ్, పోలీసు తనిఖీల సీన్లను ఇక్కడే చిత్రీకరించారు. సినిమా హిట్తో ఈ ప్రాంతం బాగా పాపులరయ్యింది.



