హైవేపై ప్రయాణికులపైకి దూసుకొచ్చిన చిరుత

AP: నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని నేషనల్ హైవేపై చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గండిపాలెం రోడ్డు సర్కిల్, చెంచురామయ్యనగర్ సమీపంలో ప్రయాణికులపైకి ఒక్కసారిగా చిరుత దూసుకురావడంతో రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు చిరుతను చూసి భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు ఉదయగిరి పరిసర గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రి వేళల్లో బయటకు రావొద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని సూచించారు.



