ప్రజాస్వామ్యంపై హేయమైన దాడి - ప్రియాంక !

పార్లమెంట్ సమీపంలో క్రాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్యలను ప్రజాస్వామ్యంపై జరిగిన అసహ్యకరమైన దాడి అని ఆమె అభివర్ణించారు. ప్రధాని ఇంటి సమీపంలో 'ఇండియా' కూటమి నేతలతో కలసి చేపట్టిన నిరసన సందర్భంగా మాట్లాడిన ఆమె, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరిపై విరుచుకుపడ్డారు. పోలీసులు ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకున్నారు.



