విమానాశ్రయ ప్రైవేటీకరణ ఆపాలి.. సీపీఎం తీర్మానం

AP: తిరుపతి విమానాశ్రయ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దశలవారీగా పోరాటాలను రూపొందించి ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. సీపీఎం తిరుపతి జిల్లా కమిటీ సమావేశంలో ప్రజా సమస్యలు, దళిత–గిరిజన సమస్యలు, విద్యా రంగ పరిస్థితులు, విమానాశ్రయ ప్రైవేటీకరణపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు.

