సీనియర్ గాయని జమునారాణి కన్నుమూత

ప్రముఖ సీనియర్ గాయని జమునారాణి(88) బెంగుళూరులో కన్నుమూశారు. 1946లో 'త్యాగయ్య' సినిమాతో బాలగాయనిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో 5 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగులో 'మామ మామ మామా' పాటతో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగులో ఆఖరిగా 'మిథునం' సినిమాలో 'ఎవరు గెలిచారిప్పుడు' పాట పాడారు.



