← Back to news

గోదావరి ఉధృతి.. లంక గ్రామాలు ఖాళీ

By DK· 2 Aug 2026· కోనసీమ జిల్లా
గోదావరి ఉధృతి.. లంక గ్రామాలు ఖాళీ

AP: గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. <a href="https://www.theclearcutnews.com/n/WGhyzXK">ధవళేశ్వరం</a> బ్యారేజీ నుంచి 16 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఉధృతికి ఇళ్లు, రోడ్లు తీవ్ర కోతకు గురవుతుండటంతో గురజాపులంకలోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరద ప్రభావంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.

More in AP