ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

TG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ దశరథ నాయక్కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం, అధికారంలోకి వస్తే ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్న రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేశాయని మండిపడ్డారు.



