కొండపల్లిలో ఉద్రిక్త పరిస్థితి
AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. మహిళలు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల నిమిత్తం ఇల్లు కూల్చివేస్తున్న సమయంలో నిర్వాసితులు అధికారులను అడ్డుకున్నారు. ఆ టైంలో ఓ మహిళా ఒంటిపై డీజిల్ పోసుకోవడంతో అక్కడివారు అడ్డుకున్నారు. డీజిల్ పోసుకున్న మహిళను ఆస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేసేవరకు ఇల్లు కూల్చివేతలను అడ్డుకుంటామని నిర్వాసితులు హెచ్చరించారు.



