← Back to news

UPని ముంచెత్తిన వరదలు.. 16 వేల మందికి పైగా తరలింపు!

By Nani Garikina· 1d ago· Ndtv
UPని ముంచెత్తిన వరదలు.. 16 వేల మందికి పైగా తరలింపు!

UPలో వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 35 జిల్లాల్లో వరద ప్రభావం కనిపించగా, 23 జిల్లాల్లో పరిస్థితి కొనసాగుతోంది. అధికారులు 16,784 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు; బుధవారం 3,042 మందిని రక్షించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. సహాయక చర్యల కోసం 1,499 పడవలు, మోటార్‌ బోట్లు, 1,067 వైద్య బృందాలను రంగంలోకి దించారు. చిట్రకూట్‌లో మందాకిని నది ఉప్పొంగడంతో 36 గ్రామాల్లో సుమారు 14 వేల మంది ప్రభావితమయ్యారు. ఇళ్లలోకి నీరు చేరడంతో పడవలతో ప్రజలను బయటకు తీసుకొస్తున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 56m ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.