ఫ్లెక్సీ కడుతుండగా షాకింగ్ విషాదం

AP: తిరుపతి జిల్లా పుత్తూరు శ్రీద్రౌపదీదేవి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్యానర్ కడుతూ ఇద్దరు డిగ్రీ విద్యార్థులు కరెంట్ షాక్కు గురై మృతి చెందారు. పుత్తూరుకు చెందిన ప్రాణ స్నేహితులు గోకుల్(19), ఎ.విఘ్నేష్(19) బ్యానర్ ఏర్పాటు చేసేందుకు రెండంతస్తుల భవనంపైకి ఎక్కారు. బ్యానర్ కడుతున్న సమయంలో సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగలకు ఫ్రేమ్ తగలడంతో విఘ్నేష్కు కరెంట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన గోకుల్ కూడా షాక్కు గురై కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.



