← Back to news

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేత

By BUJJIBABU· 1d ago
వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేత

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పురపాలక సంఘాల వార్డుల పునర్విభజనపై దాఖలైన 50 పిటిషన్లను గురువారం కొట్టివేసింది. వార్డుల విభజన సరికాదంటూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించగా, చట్ట నిబంధనల మేరకే చేస్తున్నామని ప్రభుత్వం వాదించింది. ఇరువర్గాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన వార్డుల ప్రకారం స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.