← Back to news

వైఎస్ వర్ధంతి.. కొత్తగూడెంలో కాంగ్రెస్ నివాళులు!

By samson· 2d ago
వైఎస్ వర్ధంతి.. కొత్తగూడెంలో కాంగ్రెస్ నివాళులు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో వైఎస్ వర్ధంతి ఘనంగా జరిగింది. సూర్యా ప్యాలెస్ సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వైఎస్ పేదల సంక్షేమానికి పనిచేసిన మహానేత అని కొనియాడారు. 108 ఆరోగ్యశ్రీ, రెండు రూపాయల బియ్యం, పింఛన్లు.. ఇంకా ఎన్నో పథకాలను పేదలకు అందించారన్నారు.

వైఎస్ వర్ధంతి.. కొత్తగూడెంలో కాంగ్రెస్ నివాళులు!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 7h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.